న్యూ ఢిల్లీ , నవంబర్ 24: వినియోగాదారుల కోసం తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆసుస్ సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 స్మార్ట్ఫోన్ను డిసెంబర్ 11, 12వ తేదీల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 స్మార్ట్ఫోన్ విడుదలకు ముందే ఫోటోలు లీకయ్యాయి. రియర్ ఫింగర్ప్రింట్ సెన్సార్, ఫ్రంట్ ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ కెమెరా సెటప్, 6.26 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 50000ఎంఏహెచ్ బ్యాటరీ, 19:9 ఆస్పెక్టు రేషియో, స్నాప్డ్రాగన్ 636, 4జీబీ ర్యామ్, 32జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.