కొలంబో, మార్చి 9 : ముక్కోణపు టీ-ట్వంటీ సిరీస్ లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు దించిన భారత్.. అందుకు తగ్గ ప్రతిఫలం పొందింది. ఆరు వికెట్ల తేడాతో సాధించింది. బంగ్లా విధించిన 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఈ ఘనతను సొంతం చేసుకుంది. భారత్ విజయంలో ధావన్(55) కీలక పాత్ర పోషించగా రైనా 28 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్(17) మరోసారి విఫలమయ్యాడు. భారత్ పేసర్లు జయ్దేవ్ ఉనద్కత్ 3 , విజయ్ శంకర్ 2, శార్దూల్ 1, చాహల్ 1 వికెట్ తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.