దుబాయ్, ఫిబ్రవరి 28 : ఐపీఎల్ .. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే పది వసంతాలు పూర్తి చేసుకున్నా ఈ మెగా టోర్నీ 11 వ సీజన్ కోసం క్రీడాభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మన ఐపీఎల్ వలన చాలా దేశాల్లో ఇటువంటి లీగ్ లు జరుగుతున్నాయి. మన ఐపీఎల్ టోర్నీ సఫలం కావడంతో పక్కనున్న పాకిస్థాన్.. పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్)ను ప్రవేశపెట్టింది. రెండు సీజన్లు పూర్తి చేసుకున్నపీఎస్ఎల్ 3వ సీజన్లో ప్రస్తుతం దుబాయ్ వేదికగా లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పీఎస్ఎల్కు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. పీఎస్ఎల్ లో జరుతున్న ఓ మ్యాచ్ ఫోటో లో ప్రేక్షకులు లేక వెలవెలబోతుంది. గ్యాలరీలన్ని ఖాళీగానే కనిపించాయి. ‘భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశాల్లో పీఎస్ఎల్ జరిగే చోటు ఒకటి; ఐపీఎల్ vs పీఎస్ఎల్, మీ లీగ్లో ఛీర్ లీడర్స్ కూడా లేరు’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.