హైదరాబాద్, ఫిబ్రవరి 25 : ఐపీఎల్ -11 సీజన్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో రెండు సంవత్సరాల నిషేధం తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆస్ర్టేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్కే జట్టు బాధ్యతలు అందిస్తున్నట్లు టీం మెంటర్ షేన్ వార్న్ శనివారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వెల్లడించారు. దీంతో ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్కు రాజస్థాన్ రాయల్స్ జట్టు స్మిత్ సారథ్యంలో నడవనుంది. 2014, 15 సీజన్లలో స్మిత్ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు.