హైదరాబాద్, జనవరి 11 : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఢిల్లీ డాషర్స్ జట్టు తమ చివరి లీగ్ పోరులో 4–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తాజా ఫలితంతో స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్లతో కూడిన అవథ్ వారియర్స్ జట్టు లీగ్ నుంచి వైదొలిగింది. సెమీస్ లో ఎవరు పోటీ చేస్తారో ఈ రోజు హైదరాబాద్ హంటర్స, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగే మ్యాచ్ తో తేలనుంది.