లండన్, జూన్ 17: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు పాకిస్థాన్ మద్దతుదారుల అత్యుత్సాహం . మితిమీరీoది. లీగ్ మ్యాచ్లో 124 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయిన దాయాది ఫైనల్కు అర్హత సాధించడంతో ఆ జట్టు అభిమానులు రెచ్చిపోతున్నారు. టీమిండియా దాదా, ఛాంపియన్స్ ట్రోఫీ విశ్లేషకుడు సౌరభ్ గంగూలీతో అనుచితంగా ప్రవర్తించారు. కార్డిఫ్లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై నెగ్గిన తర్వాత పాక్ అభిమానుల ఆగడాలు మితిమీరాయి. దాదా కారును అడ్డగించి, కారుపైకి ఎక్కి ‘పాకిస్థాన్ జిందాబాద్.. ఇండియా ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్మీడియాలో సంచలనం రేపుతుంది. పాక్ అభిమానులు గంగూలీని నిర్బంధించి కారు కదలకుండా చేసినప్పటికీ ఆయన మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండడం విశేషం. వారితో ఓపికగా ప్రవర్తించి హుందాతనాన్ని చాటుకున్నారు. ఆదివారం కోహ్లీసేన పాక్ను ఫైనల్లో ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.