కటక్, డిసెంబర్ 21 : కటక్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టీ-20లో శ్రీలంక చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మ్యాచ్ విషయంపై లంక జట్టు ఆటగాడు ఉపుల్ తరంగ మాట్లాడారు. "భారత్ కు టీ-20లో గట్టి పోటీని ఇవ్వలేకపోయాం. ఇక మిగిలిన రెండు టీ-20లోనైన బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తున్నాం. 20 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయాం. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యానికి చేరువలోకి కూడా వెళ్లలేకపోయాం. ఈ బాధే ఎక్కువగా ఉంది. గాయాల కారణంగా గత కొన్ని సిరీస్ల్లో కీలకమైన ఆటగాళ్ల సేవలు పొందలేకపోతున్నాం" అంటూ ఉపుల్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.