ఢాకా, డిసెంబర్ 13: బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫైనల్లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మంగళవారం ఢాకా డైనమైట్స్, రంగ్పూర్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గేల్ తన అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. రైడర్స్ ఓపెనర్గా వచ్చిన గేల్ 69 బంతుల్లోనే అజేయంగా 146 పరుగులు చేశాడు. అంతేకాదు ఏకంగా 18 సిక్సర్లు, 5 ఫోర్లు బాది ప్రపంచ రికార్డు సాధించాడు. గేల్తో పాటు బెండ్రన్ మెకల్లమ్ 54 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స్ర్లతో అదరగొట్టాడు. దీంతో రంగా రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఢాకా డైనమైట్స్ 149/9కే పరిమితం కావడంతో రైడర్స్ తొలిసారి బీపీఎల్ టైటిల్ గెలుచుకున్నారు.