న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న జంటపైనే అందరి చూపులు. అదేనండి భారత్ సారధి కోహ్లీ, అనుష్కల జోడి. గత కొన్ని రోజుల నుండి డిసెంబర్ 12న పెళ్లి అని వస్తున్న వార్తల్లో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఇప్పటికే ఐదుగురు స్టార్స్ కి ఆహ్వాన పత్రికలు అందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పెళ్లిపై ఇంకో నిజం బయటికొచ్చింది. అదేంటంటే.. వీరి పెళ్లి పై ఉన్న అనుమానాలకు అనుష్క శర్మ నివాసముండే అపార్టుమెంటు వాసులు సారాంశం పలికారు. విరాట్ కోహ్లీతో తమ కుమార్తె వివాహం అని, త్వరలో ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని, తప్పనిసరిగా అందరూ హాజరవ్వాలని అనుష్క తల్లిదండ్రులు వారిని ఆహ్వానించారట. పలువురిని ఇటలీలో జరిగే వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు కూడా ఇచ్చారట. ఇరు వైపులా సన్నిహితులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. ఓ విలాసవంతమైన హోటల్లో పెళ్లి పనులు ప్రారంభమయినట్లు సమాచారం.