న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : ప్రస్తుత క్రికెట్ రంగంలో ప్రతి ఫార్మట్ లోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. తాజాగా విరాట్ లంకేయులతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తోలి రోజు ఆట ముగిసే సమయానికి, 156పరుగులు చేసి క్రీజులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్లు, అభిమానులు అంతర్జాలంలో కోహ్లి పై అభినందనలు తెలియచేస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ " ప్రస్తుత ఈ తరం ఆటగాళ్లలో కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోను వైవిధ్యంగా ఆడుతూ గత అందరి రికార్డులను దాటేస్తున్నాడు" అని పేర్కొన్నారు. "టెస్టుల్లో విరాట్ దూకుడు చూస్తే రాబోవు తరాలు కూడా రెడ్ బాల్ క్రికెట్పై మక్కువ పెంచుకుంటారు" అని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు