వెల్లింగ్టన్, డిసెంబర్ 2: ఫిరోజ్షా కోట్లాలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా దుమ్మురేపింది. ప్రారంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన కోహ్లీ సేన, తొలి రోజు ఆద్యంతం అలరించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 371 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీ (156), హిట్ మెన్ రోహిత్ శర్మ(6) లు ఉన్నారు. లంక బౌలర్లలో సందకన్ 2, పెరిరా, గమెగా చేరో వికెట్ దక్కించుకున్నారు.