బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్ నిర్మాణంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో క్రితం ఏడాది తెరకెక్కిన జైసింహా .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా కెఎస్. రవికుమార్ చకచకా పనులు కానిచ్చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా వుంటుందట. అందువలన చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ - జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ తెరపై తలపడనున్నారన్నమాట. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.