చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే (SR) భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 1 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 3,585
పోస్టుల వారీగా ఖాళీలు..:
➦ క్యారేజ్ వర్క్స్ (పెరంబూర్): 1208
➦సెంట్రల్ వర్క్షాప్ (గోల్డెన్ రాక్): 723
➦ సిగ్నల్ , టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ (పొడనూర్): 1654
అర్హత: 10+2 విధానంలో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. ఎంఎల్టీ పోస్టులకు ఇంటర్ (బైపీసీ) ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
వయోపరిమితి: 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంఎల్టీ పోస్టులకు 24 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు..:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2019.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2019 (సా.5.00 గం)