టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్ ల మీద హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా మహర్షి. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం మే 9న వరల్డ్వైడ్గా భారీగా విడుదల కాబోతోంది.
తాజాగా చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా యు / ఏ సర్టిఫికెట్ను పొందించి ఈ సినిమా. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. రెండు వారాలు ముందుగా థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం, పీక్ సమ్మర్ సీజన్ లో విడుదల కావడం మహర్షికి అడ్వాంటేజ్ లు అని చెప్పొచ్చు. దీంతో మహర్షి బాక్సాఫీస్ లెక్కలు మాత్రం కాస్త భారీగానే వుండే అవకాశం వుంది.