మార్చ్ 24: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా గత ఏడాది ఐపీఎల్కు దూరమై ఐపీఎల్ 2019 సీజన్లో ఆరెంజ్ ఆర్మీలోకి చేరిన డేవిడ్ వార్నర్ వస్తూనే తనెంటో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. కోల్కతా వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ సత్తా చాటాడు. 53 బంతుల్లోనే 85 పరుగులు చేసి సత్తా చాటాడు. 9 ఫోర్లు, 3 సిక్స్లు బాదిన వార్నర్.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఇప్పటి వరకూ 60 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్.. 53.28 సగటుతో, 148.08 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. వార్నర్ హైదరాబాద్ తరఫున 27 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాయంతో 2664 పరుగులు చేశాడు. దాదాపు సన్రైజర్స్ తరఫున ఆడిన ప్రతి రెండో ఇన్నింగ్స్లో వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓవరాల్గా చూస్తే వార్నర్ ఐపీఎల్లోనే అత్యధికంగా 40సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో కోహ్లి (38) ఉన్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు డేవిడ్ వార్నర్ కావడం విశేషం. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ రోహిత్ శర్మ (757 రన్స్) పేరిట ఉండగా.. వార్నర్ (762) దాన్ని బ్రేక్ చేశాడు.