హైదరాబాద్ జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం రోజున 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాట్స్ ఎండీ దినకర్ బాబు 2కె రన్ ను ప్రారంభించారు.. వీరితో పాటు ఒలంపియన్ ముకేశ్ కుమార్, కంటోన్మెంట్ కార్పొరేటర్ అనితా ప్రభాకర్, డీవైఎస్ఓ సుధాకర్ రావు, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు. యువజన, క్రీడాశాఖల ఆధ్వర్యంలోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకకు 1000 మందికి పైగా అందరు కలిసి ఉల్లాసంతో 2 కె రన్ ను ముగించారు.