హైదరాబాద్, మార్చ్ 08: ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన ప్రధాన పాత్రలో కథనం సినిమా రూపొందుతోంది. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా టీజర్ను రామ్చరణ్ సతీమణి ఇవాళ విడుదల చేశారు.