హైదరాబాద్, మార్చ్ 08: ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’ తమన్నా, మెహరీన్లు చిత్రంలో కథానాయికలుగా నటించిన ఈ చిత్రం.. 2019, సంక్రాంతి పండుగగా వచ్చి.. విజయవంతంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుని.. పలు థియేటర్లలో ఇంకా కలెక్షన్లు రాబడుతుంది. ఓవర్సిస్ తో పాటు తెలుగురాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన F2.. రూ.140 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మల్టీ స్టారర్ మూవీగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమా 106 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎక్కువ సమయం ఉండడంతో కొన్ని సీన్లను చిత్రం బృందం తొలగించింది. చిత్రం విజయవంతం కావడంతో ఇప్పుడు ఆ తొలిగించిన సీన్లలో తొలి సీన్ ను నిర్మాత దిల్ రాజు.. ఆయన యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో ఇందులో మెహ్రీన్ తన బాయ్ఫ్రెండ్ వరుణ్ యాదవ్ కు ముద్దులిస్తుండగా.. వెంకీ చూస్తాడు. ఈ విషయాన్ని మెహ్రీన్ అక్కకు చెప్తే.. తమన్నా చూసేసరికి తను చదవుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్క బావ నన్ను అనుమానిస్తున్నాడంటే ఏడుస్తుంటే.. తమన్నా మళ్లీ ఫ్రస్టేషన్ అవుతాడు. ఈ సన్నివేశం భలే సరదాగా ఉంది.