స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్గా మంచి క్రేజ్ను సంపాదించిన యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ హిట్ సినిమా తర్వాత హెబ్బాకు బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ఫ్లాపులతో ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. దీంతో వరుసగా బోల్డ్ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది ఈ భామ. లాస్ట్ సినిమా ‘24 కిస్సెస్’లో తన బోల్డ్ యాక్టింగ్తో హెబ్బా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ యంగ్ బ్యూటీ మరో బోల్డ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించిందని తెలిసింది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాడికల్’ చిత్రంలో హెబ్బా పటేల్ నటిస్తోందట. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని తెలిసింది.