హైదరాబాద్, జనవరి 22: ప్రియా వారియర్ మలయాళంలో నటించిన ‘వొరు అదార్ లవ్ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే పేరుతో వాలైంటైన్స్ డే రోజు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. చిత్ర ప్రచారంలో భాగంగా ప్రియ నేడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ మిస్ చేసుకున్నానని తెలిపింది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తనకు నోటీసులు పంపిన విషయమై స్పందించిన ప్రియ.. ‘నా రెండో సినిమా ‘శ్రీదేవి బంగ్లా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విషయంలో నాకు నిర్మాత బోనీ కపూర్ నుంచి నోటీసులు రాలేదు. వివాదం గురించి దర్శక, నిర్మాతలు చూసుకుంటారు అని తెలిపింది.