హైదరాబాద్, జనవరి 13: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పేట తెలుగులో మంచి అనుకున్నంత కాకపోయినా మంచి టాకే వచ్చింది. అయితే బాబిసింహా, నవాసుద్దీన్ సిద్ధిక్, ఆడుగలం నరేన్, సిమ్రాన్, త్రిష వంటి స్టార్ నటీనటులు ఉన్నా ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపును సాధించ లేకపోతోంది. రజనీకాంత్ నటించిన చిత్రాల్లో 1995లో ‘భాషా తర్వాత ఈ సినిమానే సంక్రాంతికి విడుదలైంది. 23 ఏళ్ల తర్వాత సంక్రాంతికు వచ్చిన రజనీకాంత్ మరోమారు విజయాన్ని అందుకుంటుందని అంతా అంచనా వేసారు. కానీ బాక్సాపీసు వద్ద ఆ మ్యాజిక్ జరగలేదు.
దానికి కారణం ఈ చిత్రం మొత్తం 2 గంటల 52 నిమిషాల నిడివి ఉండటమే అని నిర్దారించారు. ఫస్ట్ హాఫ్ మాదిరిగా రెండో భాగంలో స్పీడు లేదని, అదే సినిమా సక్సెస్ ని వెనక్కి లాగేస్తోందని ట్రేడ్ వర్గాల్లో అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో భాగంలో దాదాపు 20 నిమిషాల సన్నివేశాన్ని చిత్ర యూనిట్ తొలగించనున్నట్లు తెలుస్తోంది. వొకట్రెండు రోజుల్లోనే అన్ని థియేటర్లలోనూ కొత్త వెర్షన్ ప్రదర్శితమవుతుందని సమాచారం.