న్యూఢిల్లీ , డిసెంబర్ 22: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ కోర్టు బెయిలబుల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు న్యూఢిల్లీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గౌతం గంభీర్ రుద్రబిల్డ్ వెల్ రియాల్టీ ప్రయివేటు లిమిటెడ్, హెచ్ఆర్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మోసానికి పాల్పడింది.
దీనిపై మోసపోయిన బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఘజియాబాద్లో నిర్మించనున్న ప్లాట్ల కోసం 17 మంది కొనుగోలుదారులు రూ.1.98కోట్లను చెల్లించారు. కాని ప్లాట్ల నిర్మాణం చేపట్టలేదు. తాము గౌతం గంభీర్ను చూసి ప్లాట్లు కోసం డబ్బు చెల్లించి పోసపోయామని కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు క్రికెటర్ గౌతం గంభీర్కు ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యూఢీల్లి కోర్టు గౌతం గంభీర్కు అరెస్టు వారంట్ జారీ చేసింది.