ప్రో కబడ్డీ లీగ్, అక్టోబర్ 25: బుదవారం జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ బుల్స్ 42-34 తో హరియానా స్టీలర్స్ పై విజయాన్ని సొంతం చేసుకుంది.బెంగళూరు బుల్స్ తరుపున పవన్ 21 పాయింట్లు చేసాడు. జట్టు స్కోరులో పవన్ సగం పాయింట్లు ఉండటం విశేషం. హరియాణా స్టీలర్స్ జట్టులో వికాస్ 14 రైడ్ పాయింట్లు సాధించాడు.
బుధవారం జరిగిన మరో మ్యాచ్ లో యూపీ యోధ 29-23తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. యూపీ ఆటగాళ్లు జాదవ్, ప్రశాంత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పుణేరి తరుణ తోమర్ పోరాడినా ఫలితం లేకపోయింది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే పోటీల్లో పట్నాపైరేట్స్ తో జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.