సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇటీవల తేజు నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యూ’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా తేజుకి నిరాశనే మిగిల్చింది. దీంతో కొంత గ్యాప్ తీసున్నాడు.
ఈ రోజు ధరమ్ తేజ్ తన 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్రానికి ‘చిత్రలహరి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అతిథిగా విచ్చేశారు. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ‘చిత్రలహరి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.