అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎబిసిడి’. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్పై యష్ రంగినేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మధుర శ్రీధర్, యష్ రంగినేని మాట్లాడుతూ “మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఎబిసిడి’ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రలో శిరీష్ నటిస్తున్నాడు. మాస్టర్ భరత్ అతని స్నేహితుడిగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశాం”అని అన్నారు.