లండన్లోని ఓవల్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు (ఐదో టెస్ట్) మ్యాచ్లో టీమిండియా 118 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఈ విజయంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ను 423/8 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 292 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఐదో టెస్ట్ మ్యాచ్లో 118 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.