బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్ సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వీరే దేవగణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని సూర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. వీరూ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు. వీరూ 1980ల కాలంలో లాల్ బాద్ షా, ఇష్క్ వంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. యాక్షన్ సన్నివేశాలకు తొలిసారిగా ఆయన రోప్ ను వాడారు. 1999లో అమితాబ్ బచ్చజన్ అజయ్, మనీషా కొయిరాల తదితరులు నటించిన ‘హిందుస్థాన్ కీ కసమ్ ’ సినిమాకు దర్శకత్వం వహించారు. వీరూ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. అజయ్ దేవగణ్ కు సానుభూతి ప్రకటించారు.