ఫిదా సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సంచలన తారగా మారి తెలుగమ్మాయిలా ఒదిగిపోయిన నటి సాయిపల్లవి. సాయిపల్లవికి చెందిన ఫిదా సినిమాలోని వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే.. అనే పాట యూట్యూబ్ లో నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.
అసలు యవత. ఫిదా సినిమా విడుదలై రెండేళ్లు అయినా ఈ పాటకున్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఇప్పటివరకు ఈ వీడియోను యూట్యూబ్లో దాదాపు 20 కోట్ల మందికి పైగా తిలకించారు. సాయి పల్లవి అందం, వరుణ్ తేజ్ కొంటెతనంతో ఈ పాటలో చేసే అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుణ్, సాయి పల్లవి కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచింది. శక్తికాంత్ కార్తిక్ ఈ పాటను కంపోజ్ చేయగా... సుద్దాల అశోక్తేజ సాహిత్యం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మధుప్రియ, రాంకీ ఈ పాటను ఆలపించారు. ముఖ్యంగా ఈ పాటతో మధుప్రియ పేరు తెలుగు జనాల్లో మారుమ్రోగింది.