ముంభై: సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భారత్ . అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసాక సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా కనిపిస్తుంది. ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ భారత్ . ఇందులో సల్మాన్కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. సల్మాన్ సోదరి పాత్రలో దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్ సందర్భంగా జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.