జైపూర్, డిసెంబర్ 30: దర్శక దిగ్గజం రాజమౌళి, రమా రాజమౌళిల కుమారుడు కార్తికేయ జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ల పెళ్లి వేడుక జైపూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఎన్టీఆర్, నాగార్జున, అఖిల్, రామ్ చరణ్, ప్రభాస్, రానా, అనుష్క ఇలా చాలామంది హాజరయ్యారు. వేడుకలో సంగీత్ లాంటి వేడుకలు హోరెత్తాయి. మన హీరోలంతా హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్సులు కూడ వేశారు. ఇక ఈ పార్టీలో జూ.ఎన్టీఆర్ అయితే ఏకంగా జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.