హైదరాబాద్ , డిసెంబర్ 14: శర్వానంద్ సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచె మనసు డిసెంబర్ 21 న విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం . రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా వొక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "నా పేరు సూర్య .. పేరులోని వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి" అంటూ ట్రైలర్ శర్వానంద్ వాయిస్ పై మొదలవుతోంది.
"వొక మనిషి గురించి జీవితంలో ఇంతగా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో .. సూర్య అనేవాడు ఇక నా జీవితంలో లేడుగాక లేడు" అంటూ వైశాలిగా సాయిపల్లవి డైలాగ్ తో ట్రైలర్ కొనసాగుతుంది. ఈ ఇద్దరి డైలాగ్స్ ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్ అండ్ ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ట్రైలర్ను కట్ చేసిన తీరు యువతని ఆకట్టుకునేలా వుంది. ప్రతి దశలో అంచనాలను పెంచుతూ వస్తున్న ఈ సినిమా థియేటర్లో చూడడానికి యువత ఆరాటపడుతున్నారు .