గడ్చిరోలి, ఏప్రిల్ 22 : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎటపల్లి బోరియా ఫారెస్ట్ ప్రాంతంలో ఆదివారం పోలీసులకూ, నక్సల్స్కు జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. కాల్పుల్లో చనిపోయిన నక్సల్స్లో పలువురు సీనియర్ క్యాడర్ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.