రైతుకు జాక్‌పాట్: 240 టన్నుల ఉల్లి.. రూ.1.68కోట్లు లాభం

SMTV Desk 2019-12-16 12:48:44  

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యుని నెట్టి మీద పెద్ద బండరాయి పడినట్టు అయ్యింది. కాని ఓ రైతుకు మాత్రం ఎంతో మేలు చేసింది. కేజీకి రూ.120 వరకు పలుకుతోంది.. కొన్ని చోట్ల ఆ ధర అంతకంటే ఎక్కువే ఉంది. సామాన్యుడి ఉల్లి కష్టాలు అలా ఉంటే.. రైతులకు మాత్రం భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పెరిగిన ఉల్లి ధరలతో కర్ణాటకలో ఓ రైతు నెలలోనే కోటీశర్వడు అయ్యాడు. గతేడాది ఐదు లక్షలు మాత్రమే లాభం వచ్చిందని.. ఈసారి మాత్రం భారీ లాభాలు వచ్చాయంటున్నాడు మల్లిఖార్జున. అప్పు తీర్చి ఇల్లు కట్టుకోవానుకుంటున్నానని.. అలాగే మరికొంత భూమిని కొనుగోలు చేసి వ్యవసాయాన్ని విస్తరిస్తాను అంటున్నాడు. చిత్రదుర్గతో పాటూ దేశవ్యాప్తంగా మల్లిఖార్జున్ ఓ సెలబ్రిటీ అయ్యాడు. అందరూ ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. గతంలో పంట నష్టంతో తనకు అప్పులు పెరిగాయని.. నెలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నాడు. ఉల్లిధరలు పెరగడంతో తన జీవితం మారిపోయింది అంటున్నాడు. ఈసారి 240 టన్నుల (20 టక్కుల) ఉల్లి పంట పండిందని.. కేజీ రూ.200 చొప్పున అమ్మినట్లు తెలిపాడు. రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టానని.. ఓ ఐదు నుంచి పది లక్షల లాభం వస్తుందనుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ తనకు జాక్‌పాట్ తగిలిందని తన ఆనందాన్ని పంచుకున్నాడు. 2004 నుంచి ప్రతి ఏటా ఉల్లి పంటను సాగు చేస్తున్న రైతు మల్లిఖార్జున.. కరువుతో చాలామంది ఉల్లిసాగును వదిలేసినా.. ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు.. ఉల్లిని సాగు చేస్తున్నాడు. పది ఎకరాల భూమి సొంతగా ఉండగా.. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని ఉల్లి పంట సాగు చేశాడు. అలాగే ఉల్లిసాగు అంత సులభం కాదంటున్నారు. అక్టోబర్ వరకు ఉల్లి ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. నవంబర్ మొదటి వారంలో క్వింటా రూ.7వేలుకు అమ్మారని.. కొద్ది రోజులకే క్విటా రూ.12వేలకు వెళ్లిందన్నాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లికార్జున ఉల్లి సాగు చేసి భారీగా లాభాలు అర్జించాడు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి.. నెలలోనే కోటీశ్వరుడు అయ్యాడు. 20 ఎకరాల్లో 240 టన్నుల (దాదాపు 20 ట్రక్కుల లోడు) ఉల్లి దిగుబడి రాగా.. ఆయనకు దాదాపు రూ.1.68 కోట్లు వచ్చాయి. ఆయన కష్టాలు ఒక్క దెబ్బతో తీరిపోయాయి. అతడో సెలబ్రిటీ అయిపోయాడు.