రాంచీ, ఏప్రిల్ 4: : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్దాగ్ అటవీప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు మూడు ఏకే 47 రైఫిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.