ముంబై, మార్చి 27 : భారతదేశంలో అత్యున్న సంపన్న కుటుంబమైన అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. రిలయన్స్ ఇండిస్ట్రీ ఓనర్ ముకేష్ అంబానీ పెద్ద కుమారుడి వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతాతో నిశ్చయమైంది. శ్లోక మెహతా - ఆకాష్ వివాహం కోసం ఇటివలే ఇరు కుటుంబాలు పరిచయ విందును ఏర్పాటు చేశాయి. గోవాలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ తారలు మెరిసారు. కాగా.. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్.. ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ లు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఐశ్వర్య బ్లాక్ లాంగ్ డ్రెస్ లో పాతికేళ్ళ యువతిగా తలపించగా.. ఆమె కూతురు క్యూట్ ఏంజెల్ లా కనిపించింది. ఇక శ్లోక మెహతా - ఆకాష్ వివాహాన్ని డిసెంబర్ 8 నుంచి 12 వరకు ప్లాన్ చేసినట్లు బంధువర్గాల సమాచారం.