రాంచీ, ఫిబ్రవరి 26 : జార్ఖండ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పలము జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలకు మావోయిస్టులు కనిపించడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు మరణించినట్లు బలగాలు గుర్తించాయి. మరి కొందరు మావోయిస్టులు ఉన్నట్టు భావిస్తున్న బలగాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నాయి.