హైదరాబాద్, ఫిబ్రవరి 5 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో.. రైల్వే శాఖలో విద్యుదీకరణకు కేటాయింపులు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే లోకో షెడ్లో నిర్వహించిన ఏడో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. విద్యుత్ ను ఆదా చేయడంలో రైల్వేశాఖ ముందు వరుసలో ఉందన్నారు. రైల్వేశాఖలో విద్యుదీకరణ, హైస్పీడ్ రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం లాలాగూడ లోకో షెడ్ ను పరిశీలించారు.