చెన్నై, జనవరి 6: తమిళనాట రాజకీయ ప్రవేశం చేసిన అగ్ర నటులిద్దరూ ఒక చోట కలిశారు. నడిగర్ సంఘం మలేషియాలో ఏర్పాటు చేసిన స్టార్ నైట్ షోకు, సూపర్ స్టార్ రజనీ కాంత్, విలక్షణ నటుడు కమల్ హసన్ లు హాజరయ్యారు. అక్కడ వారిద్దరూ రాజకీయ అంశాలపై చర్చలు జరిపారని సమాచారం. రజనీ చేసిన రాజకీయ ప్రకటన తరువాత కమల్ ఆయనకు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.