రాంచి, జనవరి 06: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా మరో పది మందికి నేడు మధ్యాహ్నం రెండు గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో దోషులను పేర్కొన్న తరువాత శిక్షలు ఖరారు విషయంలో న్యాయమూర్తి వాయిదా వేస్తూ వస్తున్నారు. కాగా ఈ కేసు సుదీర్ఘంగా విచారించబడింది. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగి పదవిని సైతం కోల్పోయారు. ఈ కుంభకోణం అనంతరం బీహార్ రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి.