న్యూఢిల్లీ, జనవరి 6 : రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. జనవరి 8 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. కాని అత్యవసర కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్లు ఈనెల 11న కూడా పనిచేయనున్నాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ సీహెచ్ మానవేంద్రరాయ్.. జనవరి 9 వ తేదీన ఈ అత్యవసర కేసులు దాఖలు చేసే న్యాయవాదులు, సంబంధిత అధికారుల వద్ద వ్యాజ్యాలు దాఖలు చేయాలని పేర్కొన్నారు.