హైదరాబాద్, డిసెంబర్ 31 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎనలేని అభిమాన౦ ఆయన సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సినిమా వస్తుందంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా పవన్ కథానాయకుడిగా నటిస్తున్న "అజ్ఞాతవాసి" సినిమా కోసం యావత్ తెలుగు సినీ పరిశ్రమ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్పై ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ టీజర్పై వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్లో కొత్తగా విడుదలైన "అజ్ఞాతవాసి" పోస్టర్లను పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ హావాభావాలను ప్రస్తావి౦చారు. చేతులు కట్టుకుని నిల్చొని ఉన్న పోస్టర్ను ఉద్దేశిస్తూ.. "గత జన్మలో కూడా నేను ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదు. పీకే (పవన్కల్యాణ్) ముందు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎందుకు పనికి రారు. బ్రూస్లీకి మొగుడిలా ఉన్నాడు" అన్నారు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తు౦డగా, అనిరుద్ స్వరాలు సమకూర్చారు.