మేఘాలయ, డిసెంబర్ 30 : మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాకిచ్చారు. హస్తం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది శాసన సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్న నేపధ్యంలో ఈ పరిణామం ముకుల్ సంగ్మా ప్రభుత్వంకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిఎన్ సయ్యం రాజీనామా చేయగా, తాజాగా ఇవాళ మరో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ బలం 24కు పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా జనవరి 4న కె.సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.