బీజేపీ పై రాహుల్ విమర్శలు...

SMTV Desk 2017-12-29 14:30:57  congress rahulgandi, bjp

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 28న జరిగిన కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కార్యకర్తలను, పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే, భారతీయ జనతా పార్టీ అబద్ధాలను దీటుగా వాడుకుంటుందని, ఆయన ఆరోపించారు. బీజేపీ పూర్తిగా అసత్య ప్రచారంతో లబ్ధి పొందుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, సరే సత్యం కోసమే పోరాడుతుందన్నారు. రాజ్యాంగానికి కూడా నేడు ముప్పు పొంచి ఉందని, బీజేపీ సీనియర్‌ సభ్యులే నేరుగా రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.