జైపూర్, డిసెంబర్ 25: ఆవు మనకు అమ్మలాంటిదని, వాటిని అక్రమంగా తరలిస్తే...చంపితే వారు కూడా హత్యకు గురవుతారని భాజపా శాసనసభ సభ్యుడు జ్ఞాన్దేవ్ అహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న ఆవులను ఓ ట్రక్కులో అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసుకు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. పొలీస్ చెక్ పోస్ట్ వద్ద ఆవులకు తరలిస్తున్న ట్రక్కును ఆపకుండా బారికేడ్లను ఢీకొడుతూ దూసుకెళ్ళాడు ఓ వ్యక్తి. విషయం తెలిసిన గ్రామస్తులు ట్రక్కును అడ్డగించి వాహనంలో ఉన్న జాకీర్ ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో నిందితుడు జకీర్పై గ్రామస్తులు దాడి చేశారనే ఆరోపణలను ఖండిస్తూ... జాకీర్ పారిపోతుండగా ట్రక్కు బోల్తా పడి అతడు గాయపడినట్లు అహుజా తెలిపారు.