న్యూఢిల్లీ, డిసెంబర్ 23: నూతన ఆలోచనతో రాజ్యసభ సభ్యుల కమిటీ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక అందించింది. " ప్రతి ట్రాఫిక్ పోలీసు, ఆర్టీవో అధికారి తప్పనిసరిగా బాడీ కెమెరాలను ధరించాలి. అంతేగాక, ఆ కెమెరాల్లో రికార్డయ్యే వీడియోలపై కంట్రోల్ రూం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. దీని వల్ల ఆయా శాఖల్లో చోటు చేసుకునే అవినీతి కూడా తగ్గుతుంది" అని కమిటీ తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.