చెన్నై, డిసెంబర్ 22: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ఖాన్ చేసిన ట్వీట్లో పొరపాటు చోటు చేసుకుంది. ఆయన ఇటీవల తన ట్విట్టర్ పేజీలో రాజకీయ నాయకుల అవినీతిపై హెచ్చరించేలా ఓ ట్వీట్ చేశారు. అందులో తమిళనాడు దివంగత నేత జయలలితకు బదులు జయ సన్నిహితురాలు శశికళ పేరును తప్పుగా ప్రస్తావించారు. ఆ ట్వీట్ లో " దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటిగా ఎదిగి తర్వాత రాజకీయ నేతగా మారిన శశికళ ఇటీవల మృతి చెందారు. ఆమె నివాసంలో భారీగా నగదు, బంగారం లభించాయి. ఈ ఘటన అవినీతి రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక. మీరు ఎంత దోచుకున్న తర్వాత అవి మీకు ఉపయోగపడవు" అని తెలిపారు.