బెంగుళూరు, డిసెంబర్ 21 : సామాజిక ఉద్యమనేత, న్యాయవాదిగా ఎదిగిన గుజరాత్ రాష్ట్ర దళిత నేత ఎదిగిన జిగ్నేశ్ మేవానీ 2019 లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొనున్నారని సమాచారం. జిగ్నేశ్ గుజరాత్ లో ఉనా గ్రామంలో దళితులపై గో రక్షకుల దాడి అనంతరం దళిత అస్మిత యాత్ర పేరిట ఆందోళనకు నాయకత్వం వహించారు. తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఆయన వాద్గావ్ నియోజక వర్గం 19, 696 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దళితుల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ జిగ్నేశ్ను ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇందుకు జిగ్నేశ్ మేవానీ కూడా తన అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.