జమాల్ పూర్, డిసెంబర్ 20: బీహార్లోని ఓ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి నక్సలైట్లు దాడి చేశారు. అంతేకాదు అక్కడి అధికారులను కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జమల్పూర్ జిల్లాలోని మసుదాన్ రైల్వేస్టేషన్పై కొందరు నక్సలైట్లు దాడి చేసి, అక్కడ ఉన్న కమ్యూనికేషన్ గదికి నిప్పంటించారు. అనంతరం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, మరో అధికారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మసుదాన్ ట్రాక్పై రైలు రాకపోకలు చేపడితే తమను చంపేస్తామని నక్సలైట్లు బెదిరించినట్లు స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.