న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భాజాపా పార్లమెంటరీ సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నేడు (బుదవారం) పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్షాలను పార్టీ నేతలు సత్కరించారు.