భద్రాద్రి, డిసెంబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం మేలపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు గ్రూపులలో చంద్ర పుల్లారెడ్డి బాట వర్గీయులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం మావోయిస్టులు అటవీ ప్రా౦తమలో తిరుగుతున్నారన్న సమాచారంతో కూంబింగ్ ప్రారంభించిన ప్రత్యేక పోలీస్ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. నరేష్, రాము, సుభాష్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.